సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ వేదికపైన సత్తా చాటారని పలువురు కొనియాడారు. 1923 కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్..తాజా జన్మదినంతో వందో జయంతి పూర్తయినట్లు అభిమానులు ఆనంద పడుతున్నారు. మరోవైపు ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు.
ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఏ పార్టీ ఎంత విరాళాలను సమకూర్చుకున్నాయనే దానిపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు అధికార పార్టీలు మొదటి ఐదు స్థానాల్లో ఉండటం విశేషం. డీఎంకే, వైఎస్ఆర్సీపీ సహా ఐదు ప్రాంతీయ పార్టీలు రాజకీయ విరాళాల ద్వారా ఐదింటి నాలుగొంతు ఆదాయం పొందాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఏ పార్టీ ఎంత విరాళాలను సమకూర్చుకున్నాయనే దానిపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు అధికార పార్టీలు మొదటి ఐదు స్థానాల్లో ఉండటం విశేషం. డీఎంకే, వైఎస్ఆర్సీపీ సహా ఐదు ప్రాంతీయ పార్టీలు రాజకీయ విరాళాల ద్వారా ఐదింటి నాలుగొంతు ఆదాయం పొందాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? 2024లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నాడా? చంద్రబాబు, బాలయ్య మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్టీఆర్ వస్తే టీడీపీ ఫేట్ మారుతుందా? కొడాలి నానిలాంటి ఎన్టీఆర్ తో కలిసి నడుస్తారా? ఏపీలో ఎన్నికల వేడి మొదలుకాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉండే అమర్ జవాన్ జ్యోతి తన శాశ్వత జ్యోతితో పాటు ఈ సంవత్సరం జనవరిలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మిళితం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేలకొరిగన సైనికుల గౌరవార్థం అమర్చిన ఐకానిక్ రైఫల్, యుద్ధ కాలపు హెల్మెట్ను కూడా శుక్రవారం (మే 27న) జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్దకు తరలించారు.
వైద్య రంగానికి సంబంధించి భారత్ మరో అడుగు ముందుకు వేసింది.. ఇంకా పూర్తిస్థాయిలో ఊపిరి కూడా పోసుకొని మంకీ వైరస్ ను గంట వ్యవధిలోనే గుర్తించేలా ఆర్ టి పి సి ఆర్ పరీక్షణ అభివృద్ధి చేసింది. న్యూఢిల్లీలోని ప్రైవేట్ హెల్త్ కేర్ పరికరాల సంస్థ టివిట్రాన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.
పంజాబ్ లో నయాశకం మొదలైందా?యోగిలా ఇతను కూడా దేశం దృష్టిని ఆకర్షింబోతున్నాడా? మొన్న అవినీతి మంత్రిని పీకేశారు..ఇప్పుడు 4 వందికి సెక్యూరిటీ తొలగించారు. పంజాబ్ లో అసలేం జరగుతోంది.
ప్రపంచంలో జీవించి ఉన్న వృద్ధ కుక్కగా అమెరికాకు చెందిన ఓ శునకం తాజాగా గినీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. సౌత్ కరోలినా రాష్ట్రంలోని పాక్స్ టెరియర్ ప్రాంతానికి చెందిన పెబెల్స్ అనే కుక్కకు ఈ రికార్డు దక్కింది. 22 సంవత్సరాల 59 రోజుల ఈ కుక్కను తాజాగా గినీస్ బుక్ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం వివిధ పరీక్షలు నిర్వహించి, అంతా బాగుందని తేల్చారు.
అమెరికాలో పాఠశాల విద్యార్థులపై కాల్పుల సంఘటనలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఇవి ఎంతగా పెరిగాయంటే … రోడ్డు ప్రమాదాలు, డ్రగ్ కేసుల సంఖ్యను మించిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. తుపాకీ కాల్పుల్లో చనిపోయిన పిల్లలు, యుక్తవయస్కుల సంఖ్య 4,300. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, అనుకోకుండా సంభవించిన మరణాలు కూడా ఉన్నాయి.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ బతికేసిన లక్షలాది మంది అమరికన్ వర్కర్లు, ఉద్యోగులు, ఇప్పుడు తప్పనిసరిగా ఆఫీసులకు రావలసివస్తోంది. కానీ ఒక్కసారిగా వీరికి ప్రపంచం చాలా భారమైపోయింది. ప్రయాణం నుంచి టీ, కాఫీ, ఫుడ్ వరకు అన్నింట ధర పెరిగి అమెరికన్ వర్కర్లు బెంబేలెతిపోతున్నారు.
ప్రముఖ బెంగాలీ మోడల్ మంజుషా నియోగి కోల్కతాలోని తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు మరో బెంగాలీ మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకున్న కేవలం రెండు రోజుల తర్వాత నియోగి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
సంగీత ప్రియులు ఆస్వాదించే భిన్నమైన సంగీతాన్ని వారికి అందించి, ఆనందాన్ని కలిగించే దిశగా ఇన్ స్టాగ్రామ్ మరో అడుగు ముందుకు వేసింది.. వన్ మినిట్ మ్యూజిక్ ని సరికొత్తగా పరిచయం చేసింది.
''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది'' అని పేర్కొంది ఎఫ్3
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త నోట్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో రెండు రోజుల క్రితమే Infinix Note 12 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్లో రెండు స్మార్ట్ ఫోన్లు జనాల ముందుకు వచ్చాయి.
బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 కెరెట్ బంగారం రూ.51,980కి దిగివచ్చింది. గురువారంతో పోల్చుకుంటే రూ.270 తగ్గింది. కాగా గురువారం రూ.52,250 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక వెండి విషయానికి వస్తే ఒక కిలో వెండి రూ.61,500 వద్ద ట్రేడ్ అయ్యింది. గురువారం నాడు ఏకంగా రూ.500 తగ్గముఖం పట్టింది. కాగా గురువాంరం నాడు రూ.62,000 వద్ద ట్రేడ్ అయ్యింది.
పరదీప్ ఫాస్ఫేట్స్ కంపెనీ షేర్లు బిఎస్ఈ / ఎన్ఎస్ఈ జాబితాలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సంస్థ ఈక్విటీ షేర్లను చేరుస్తున్నామని, వాటిని స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ లో భాగంగా బి గ్రూపు సెక్యూరిటీలుగా పరిగణించవచ్చని బిఎస్ఈ వెబ్ సైట్ సూచించింది.
సోషల్ మీడియాకు కనీసం వారం రోజులపాటు దూరంగా ఉన్నా సరే వ్యక్తుల సమగ్ర ఆరోగ్యంతో పాటు మానసికారోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత తరంలో సాధారణం అయిపోయిన కుంగుబాటు, ఆందోళనలను కూడా ఇది తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనా సోకినవారు వాసన కోల్పోవడం సాధారణ లక్షణమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డాక వాసన చూడలేకపోతున్నారు. కొంతమంది తాత్కాలికంగా వాసనను కోల్పోతుంటారు. మరికొందరు కరోనా నుంచి బయటపడిన రెండు, మూడు నెలల వరకూ వాసనను చూడలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జనాభాలో అధికభాగం నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే వీరిలో 2 శాతం మంది మాత్రమే డాక్టర్లతో తమ సమస్యను చర్చించాల్సిన ఉందని భావిస్తున్నారు. కానీ మంచి నిద్ర లేదా గాఢనిద్ర కోసం తగిన వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఈరోజుల్లో చాలా అవసరం.
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ 2022కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు(మే 29) ఈ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా. పోలా భాస్కర్ వెల్లడించారు.
సీబీఎస్ఈ ద్వారా పదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోర్డు నిర్వహణకు నిర్వహించిన పరీక్షలు ముగిసిపోవడంతో తుది ఫలితాలపై ఆందోళనలు మొదలయ్యాయి. దీనికి కారణం 2022 బ్యాచ్కు సంబంధించి ఒకే తరగతి లోని విద్యార్థులకు రెండు పరీక్షలు నిర్వహించాలని మొదటిసారిగా బోర్డు నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం తో ముగుస్తుందందని నిర్వాహకులు చెబుతున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్- tslprb. in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 17 వేల పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది సంగతి తెలిసిందే. దరఖాస్తుదారులు రాత్రి 10 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఈ ఏడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన అద్భుతమైన అవుట్ఫిట్స్తో అదరగొడుతోంది బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్. ఈ నటి తన రెడ్ కార్పెట్ లుక్స్కు సంబంధించిన స్నిప్పెట్స్ను ఇన్స్టాగ్రామ్ ఫ్రొఫైల్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా హీనా ఫ్రెంచ్ రివేరా లో రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ పిక్చర్స్ను తన ఇన్స్టా ప్రొఫైల్లో షేర్ చేసి అందరి మతులు పోగొడుతోంది
క్లాసిక్ బ్లాక్ అవుట్ ఫిట్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి విడిపోవని మరోసారి మన బాలీవుడ్ తారలు నిరూపించారు. రెడ్ కార్పెట్ ఈవెంట్స్ అయినా, సెలబ్రిటీల పార్టీలైనా, బాలీవుడ్ భామలు బ్లాక్ అవుట్ఫిట్స్ ధరించి స్టైలిష్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. నిజానికి అన్ని అకేషన్లకు బ్లాక్ అవుట్ఫిట్స్ అనేవి ఇప్పుడు అందరి ఆల్ టైం ఫేవరేట్ అయిపోయాయి.
స్టార్ కిడ్ గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా ...అతి కొద్ద కాలంలోనే తనకంటూ క్రేజ్ను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా తన ఫ్యాషన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అలరిస్తుంది ఈ బ్యూటీ.
మార్చి, 2022లో నిర్వహించిన ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో తన సమ్మతి లేకుండా వీడియో తీశారంటూ జిమ్నాస్ట్ అరుణారెడ్డి బుద్దా కోచ్ రోహిత్ జైస్వాల్ పై ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలను విచారించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శుక్రవారం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ..రిషబ్ పంత్పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ 100కి పైగా టెస్టు మ్యాచులు గానీ ఆడితే...అతడి పేరు చరిత్ర పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని జోస్యం చెప్పాడు. వన్డే మ్యాచులు, టీ20 లకే పరిమితం అయితే రిషబ్ పంత్ను ఎవరూ గుర్తుంచుకోరని...ఎక్కువగా టెస్టులు ఆడాలని సెహ్వాగ్ సూచించాడు.
బెంగళూర్ జోరుకు రాజస్థాన్ బ్రేక్ వేసింది. కీలకమైన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్ 2022 ఫైనల్స్ కు చేరింది. బెంగళూర్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని సునాయాశంగా చేరుకుంది. జోస్ బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యానికి చేర్చాడు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇటీవలే రామాయణ్ ఎక్స్ప్రెస్ పేరుతో హిందూ ఇతిహాసంతో సంబంధం ఉన్న ప్రదేశాలకు యాత్రికులను తీసుకెళ్లే ప్రత్యేక పర్యాటక రైలును ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది. 18 రోజుల 'శ్రీ రామాయణ యాత్ర' జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది.