మొదటి పాశురంలో గోపికలు తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో, ఈ వ్రతానికి సాయపడువారు ఎవరో, ఆ వ్రతమును చేయడానికితమకు ఏమి అధికారమో వివరించారు.ఆ. ఏ వ్రతం చేయాలనుకున్నా ఆ వ్రతం యొక్క నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆచరించాలి. తాము ఆ వ్రతాన్ని చేయగలమా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే నియమాలు కష్టం గా ఉన్నాయని మధ్యలో వ్రతాన్ని వదిలివేస్తే నలుగురిలో నవ్వులపాలుకాక తప్పదు.అందుకని గోదాదేవి చెలులం దరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత ఆ వ్రత నియమాలను రెండవ పాశురంలో వివరించింది. మరి ఆ నియమాలను తెలుసుకోండి.
పాశురం 2
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
భావము
భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అని చెబుతోంది గోదాదేవి. శ్రీకృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభవిస్తున్న వారలారాఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్ప రుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రిస్తున్న శ్రీహరి పాదపద్మములకు మంగళము పాడుదాము. ఆ పాదపద్మాలను స్తుతిస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఇక నెయ్య, పాలు మనకు అక్కర్లేదు. అందుచేత ఈ వ్రతం ఆచరించు సమ యంలో నేతిని, పాలనుగాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళా న్ని ఇచ్చేపూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టమని చెప్పిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు కానీ అసత్యాలు ఎప్పుడు గాని, ఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించే, కష్టములు కలిగించే పను లనుగాని, ఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి వారిని ధనధాన్యాలతో సత్కరిస్తాము.
బ్రహ్మచారులకు, బిక్షువులకు ఆహారాన్ని అందిస్తాము. ప్రతిరోజు ఆ భగవంతుని గుణాలను కీర్తిస్తూ ఈ సంసార బంధనాలనుండి విము క్తి పొందడం ఎలా అనేదాని గురించి ఆలోచిస్తాం..శాస్త్రము కంటే కూడా , భక్తి ప్రధానమైంది. భగవంతుని కృప, గురు కృప చాలా ముఖ్య మైన వని భావిస్తాము. అవి ఉంటే చాలు మనం సులభంగా ఈ వ్రతాన్ని పూర్తిచేయగలము. దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఆ గురుకృపను పొందుదాము. విశ్వానికంతటి కీ గురు వైన శ్రీకృష్ణుడిని శరణువేడుదాము. శ్రీకృష్ణునిసేవకే అంకితమై, తనకు తాను ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన ఆండాళ్ తల్లి ఈ పాశు రంలో ఈవిధంగా వ్రత నియమాలు చెప్పింది.