
Congress MLA dies during election campaign: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి.
ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెరిగింది. తాజాగా ఈ నెల 12వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కూనర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
రాజస్థాన్లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ కు పది రోజుల ముందు గుర్మీత్ సింగ్ మరణించడంతో ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
గుర్మీత్ సింగ్ ప్రస్తుతం కరణ్పూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్, పృథివాల్ సింగ్ సంధులను ఓడించి మంత్రి అయ్యారు. ఈసారి కూడా ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో నవంబర్ 25న 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది. 199 స్థానాలకు పోలింగ్ జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రాజస్థాన్లో 2013, 2018లో కేవలం 199 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.