Boys Drown In Lake : కృష్ణా జిల్లా లో ఓ ఘటన చోటు చేసుకుంది..ఫోటోల సరదాకు ఇద్దరు విద్యార్థులు బలి.

An incident took place in Krishna district..Two students were victims of photo fun.

Boys Drown In Lake : కృష్ణా జిల్లా లో హృదయవిధారక ఘటన..ఫోటోల సరదాకు ఇద్దరు విద్యార్థులు బలి..

కృష్ణా జిల్లా లో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోటోల సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. టీనేజ్ లో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థుల మృతితో వారి స్వగ్రామాలలో విషాదఛాయలు అలముకున్నాయి.

విజయవాడ నగరం పటమటకు చెందిన ఎన్‌ శశివర్ధన్‌ జి, అంకిత్‌ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. శశివర్ధన్ వయసు 15 కాగా అతడు 10 వ తరగతి చదువుకుంటున్నాడు.

అంకిత్ వయసు 14 సంవత్సరాలు కాగా అతడు 9వ తరగతి చదువుకుంటున్నాడు. వీరిద్దరూ గన్నవరం మండలం సావరగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చెరువు వద్దకు వెళ్లారు. వెళుతూ వెళుతూ వారి స్నేహితులను కూడా అక్కడకు రావాలని కబురందజేశారు.

అయితే ముందుగా అక్కడికి వెళ్లిన శశివర్ధన్ అంకిత్ లు ఫోటోలు దిగాలని అనుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు..చెరువు గుంతలో పడిపోయారు.

వీరిద్దరికి ఈత రాకపోవడంతో నీటి మునిగిపోతూ ఉన్నారు. అయితే అదే సమయానికి వారి స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో మునిపోతున్న శాశివర్ధన్ అంకిత్ లను చూసి కాపాడాలంటూ కేకలు వేశారు..

గమనించిన గ్రామస్థులు అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అగ్నిమాపసిబ్బందిని అప్రమత్తం చేశారు.

సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికే విద్యార్థులిద్దరి ప్రాణాలు నీటిపాలయ్యాయి.

శాశివర్ధన్, అంకిత్ ల మృతదేహాలను చెరువు గుంత నుండి వెలికి తీశారు. విగతజీవులుగా మారిన వారి బిడ్డలను చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటన చూపరులను కూడా కలిచివేసింది

Leave a Comment