బీహార్ మాజీ సీఎం కి భారతరత్న : Bharataratna For Bihar Ex CM

website 6tvnews template 7 1 బీహార్ మాజీ సీఎం కి భారతరత్న : Bharataratna For Bihar Ex CM

బీహార్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఒక శుభవార్తను వినిపించింది. ఆ రాష్ట్ర ప్రజలు ప్రేమగా జన్ నాయక్ అని పిలుచుకునే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్(Ex CM Karpoori Thakur) కు భారత రత్నను(Bharataratna) ప్రకటించింది. జనవరి 24 వ తేదీ 1924 వ సంవత్సరంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు.

అందుకే అయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును అయన కుటుంబసభ్యులు అందుకుంటారు. ఇక కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్య మంత్రిగా పనిచేశారు. అయన 1970 నుండి 1971 వ రకు ఒకసారి అలాగే 1977 నుండి 79 వరకు రెండవసారి బీహార్ కు ముఖ్య మంత్రిగా సేవలు అందించారు.

ఇక కర్పూరి ఠాకూర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అంటారు. అయన 1988 వ సంవత్సరంలో కన్ను మూశారు.

2024 జనవరి 24 వ తేదీ తో అయన శత వసంతాలు పూర్తిచేసుకుంటారు. అందుకే అయన శత జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయన తల్లి పేరు రామ్దులారి తండ్రి పేరు గోకుల్ ఠాకూర్, వీరిది పితౌంఝియా అనే ఒక కుగ్రామం. కేవలం ఒక సామాన్య నాయీ సామాజికవర్గం లో జన్మించిన కర్పూరి ఠాకూర్ అసామాన్య స్థాయికి ఎదగడం అనేకమందికి స్ఫూర్తిదాయకం.

Leave a Comment