Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్, అర్జున్ ల మధ్య వివాదం..

Bigg Boss 7 Telugu


ఒక్కడిని చేసి ఆడుకుంటున్న గ్రూపులు !

ఓటు అప్పీలుకోసం ఛాన్స్ గెలిచేందుకు ఒక వింత ఆట పెట్టాడు బిగ్ బాస్.
ఇసుకతో చేసిన కేక్ ని తెప్పించి దాని మీద ఉన్న చెర్రీ కిందపడకుండా దాన్ని కోయగలిగిన వారే ఈ గేమ్ లో విజేతలుగా ప్రకటించారు.

ఆ విజేతలే ఓటుకు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఈ ఆటలో అమర్ దీప్ విజయం సాధించాడు.
ఇంతకుముందు టాస్క్ లో ఆటని ఇచ్చాడు బిగ్ బాస్.

ఒక ఇద్దరు పిల్లల బొమ్మలు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి, ఆ పిల్లలని బిగ్ బాస్ పిల్లలని చెప్పి, బిగ్ బాస్ షాపింగ్ కి వెళ్తున్నాడని, వచ్చేంతవరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించాడు.
ఇక హౌస్ లోని సభ్యులంతా చాలా జాగ్రత్తగా చుస్కుంటున్నట్టు, నిజమైన పిల్లలతో ఉన్నట్టే నటించారు.
ఓటు అప్పీలు కోసం పెట్టిన మొదటి ఆట పూర్తైన తరువాత మరో ఆట ఇచ్చాడు బిగ్ బాస్.

బయట గార్డెన్ ఏరియాలో ఒక గంటని పెట్టి, ఒక బజర్ మోగగానే ఆ గంట కొట్టాలన్నది ఆట సారాంశం.
ఇక గంట మోగగానే అందరు గంట కొట్టేందుకు పరిగెత్తారు. ఈ క్రమంలో అర్జున్ చెయ్యి ప్రశాంత్ దవడకు గట్టిగ తగిలింది. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

అప్పటికి అర్జున్ గంట మోగించేసాడు. ఇక దెబ్బ తగిలించాడని అర్జున్ ని ప్రశాంత్ అన్నాడు. దానికి అర్జున్ నాకు అలవాటు రా పరిగెత్తేటప్పుడు చేతులు వెనక్కి నెట్టడం అంటూ తాపీగా చెప్పాడు.
ఇక ఈ గొడవలో సంచలక్ అయిన అమర్ కూడా అర్జున్ నే సమర్థిస్తూ ప్రశాంత్ దే తప్పని చెప్పాడు. ఇంట్లో అన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఎవరు ఏమి మాట్లాడటం లేదు.

ప్రియాంక మాత్రం ముందుకు వచ్చి ప్రశాంత్ నే నోటికొచ్చినట్టుగా తిట్టేసింది. ఇక అందరు ఒకటైనట్టు అర్జున్ వైపు మాట్లాడుతుంటే ప్రశాంత్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే శివాజీ వచ్చి ప్రశాంత్ ని తీసుకెళ్లాడు.

Leave a Comment