ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ఇప్పటి హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)తన ఫ్యామిలీతో కలిసి భారత్ లో సందడి చేస్తోంది. భర్త నిక్ జోనాస్ (Nick Jonas) , కూతురు మాల్టీ మేరీ (Malti Marry)తో కలిసి భారత్ టూర్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. భారత్ రాక సందర్భంగా తన కుటుంబంతో కలిసి అయోధ్య (Ayodhya) బాలరామ మందిరాన్ని సందర్శించింది ప్రియాంక .
రాములవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అంతే కాదు ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్లో ఓ గ్లింప్స్ను పంచుకుంది. మరపురాని అయోధ్య యాత్ర అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె ఫ్యామిలీ ఫిక్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో స్వామిని దర్శించుకోవడం పట్ల నెటిజన్స్ ఆమెను అభినందిస్తున్నారు.
ముంబైలో జరిగిన ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’(Women Of My Billion) డాక్యుమెంటరీ ఈవెంట్ కోసం ప్రియాంక(Priyanka Chopra), నిక్ (Nick Jonas)దంపతులు భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అత్యంత వైభవంగా ప్రారంభమైన అయోధ్య (Ayodhya)రామాలయాన్ని ఈ జంట సందర్శించింది. ప్రియాంక , నిక్ తో పాటు ఆమె కూతురు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ప్రియాంక పసుపు చీర కట్టుకోగా నిక్ కుర్తా పైజామా ధరించి ఆలయానికి చేరుకున్నారు. బాల రామయ్యను దంపతులు దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు అందించి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామిఆశీస్సులు తీసుకున్నారు. రాముల వారి దర్శనం పూర్తికాగానే ప్రియాంక అండ్ ఫ్యామిలీ ఫొటోలకు ఫోజులిచ్చారు. తన రెండేళ్ల కూతురు మాల్టీ (Malti)తో ప్రియాంక ‘అయోధ్య’అని అనిపించిన వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.
ఈ ఏడాది జనవరి 22 న అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. అప్పటి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రారంభోత్సవం నాడే దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా బాలక్ రామ్ ను దర్శించుకున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ కపుల్స్ అలియా భట్ (Aliya Bhatt),రణ్ బీర్ కపూర్ (Ranbhir Kapoor),విక్కీ కౌశల్ (Vicky Koushal),కత్రినా కైఫ్ (Katrina Kaif) అయోధ్య రాముడిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రియాంక, నిక్ కపుల్స్ ఆలయాన్ని సందర్శించారు.