CM Revanth Reddy’s immediate journey to Andhra – will he meet Jagan! : ఈరోజు తెలంగాణా ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ఆంధ్ర ప్రదేశ్ వేల్లన్నున్నారు. ఎన్నికల షెడ్యుల్ వస్తున్న తరుణం లో ఆయన ఆంద్ర ప్రదేశ్ వెళ్ళడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మొదట అందరు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్తున్నారని అంటూ పలు ఊహాగానాల మధ్య ఆయన ఆంధ్ర వెళ్ళడం గురుంచి అధికారులు వివరాలు అందజేశారు. ఆయన వెళ్తున్నది విశాఖపట్నం అని, కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడుస్తున్న వేళ వారికి సంఘీభావం గా కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపింది.
ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం కోసమే ఆయన విశాఖ కు వెళ్తున్నారని అధికారులు చెప్పారు.ఈ సాయంత్రం విశాఖ తీరాన ఒక బహిరంగ సభ ఉంది అని దానికి ఆయని ముఖ్య అదితి గా వెళ్ళి ప్రసంగిస్తారని చెప్పారు.
ఈ సభకు ” న్యాయసాధన సభ ” అని ఒక పేరు పెట్టడం కుడా జరిగిందని వారు చెప్పారు. ఈ సభకు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా హాజరు అవుతారని వారు చెప్పారు. ఈ సందర్భం గా తెలంగాణా ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం చెప్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సి లను ఏర్పాటు చేసారు.