Bigg boss 7 Winner Prashanth: వివాదంలో చిక్కుకున్న బిగ్ బాస్ విన్నర్.

Controversial Bigg Boss winner.

Bigg boss 7 Winner Prashanth: వివాదంలో చిక్కుకున్న బిగ్ బాస్ విన్నర్.

పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇద్దరు అరెస్ట్, పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు.. Bigg boss 7 Winner Prashanth విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పైన హైదరాబాద్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.

Bigg boss 7 Winner Prashanth గ్రాండ్ ఫినాలేలో అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ రేస్ లో ఇద్దరు చివరి వరకు వచ్చారు. ఇద్దరిలో విజేతగా ఒక్కరినీ నిర్ణయించే సమయానికి ఇరు వైపులా ఫాన్స్ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుండగా,

నాగార్జున పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించాడు. ఇక పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎంతో సందడి చేశారు, అమర్ దీప్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ, పల్లవి ప్రశాంత్ అభిమనులతో వాగ్వివాదానికి దిగారు.

అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇద్దరి ఫాన్స్ గొడవ పెట్టుకున్నారు, ఈ గొడవ రోడ్ల మీద వరకు వెళ్ళింది. RTC బస్సులు, ప్రైవేటు వాహనాలపై దాడికి దిగారు.

పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ యాజమాన్యం ఈ ఉద్రిక్తత కారణంగా వేరే దారి గుండా రహస్యంగా బయటకు పంపించింది, అయితే పల్లవి ప్రశాంత్ ఇదేమీ లెక్కచేయకుండా టాప్ లెస్ జీప్ ఎక్కి ఫాన్స్ మధ్యలోకి వెళ్ళడం వల్ల ఈ రచ్చ మరింత పెద్దదయ్యింది.

రెండు వైపులా అభిమానులు రాళ్ళతో కొట్టుకోవడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో అమర్ దీప్,అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ ల కార్ ల పైన దాడి జరిగింది.

దానితో గీతు రాయల్ వీరి పైన కేసు నమోదు చేసింది.అక్కడ జరిగిన సంఘటనలో CC ఫూటేజి ఆధారంగా చూసి, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

వీరితో పాటు టైటిల్ గెలిచిన వెంటనే వివాదంలో చిక్కుకున్నాడు పల్లవి ప్రశాంత్, అదుపులోకి తీసుకున్న ఇద్దరితో పాటు, పల్లవి ప్రశాంత్ పై కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్ 147, 148, 290, 353, 427 r/w 149 IPC కింద కేసు నమోదు చేశారు.

Leave a Comment