![website 6tvnews template 2024 03 07T160216.889 అయోధ్య రామయ్య వెబ్ సైట్ హ్యాకింగ్ కు పాక్,చైనా హ్యాకర్లు](https://6tvnews.com/wp-content/uploads/2024/03/website-6tvnews-template-2024-03-07T160216.889-1024x576.webp)
ఆలయ నిర్మాణం పూర్తి అయ్యింది. దేశ విదేశాలనుండి ఆ రామయ్య భక్తులు తరలి వస్తున్నారు. అయితే మన తిరుపతి లో ఉండే విధం గానే ఆన్లైన్ దర్శన్ పేరిట ఒక వెబ్ సైట్ ను భక్తుల కోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఇటీవల అందరికి అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు అందరు దర్శనం కోసం ఈ వెబ్ సైట్ ను ఉపయోగించుకుంటున్నారు. దీని వల్ల అందరికి తొందర గా దర్సనం అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఈ అయోధ్య రామాలయం మీద ఎప్పటినుండో అందరి కళ్ళు ఉన్నాయి. ఎలాగైనా భారత్ కు ఇబ్బందులు గురిచేయ్యలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి మన పొరుగు దేశాలు పాక్, చైనా లు. ఏ మాత్రం అవకాశం దొరికిన విరుచుకు పడడానికి అది ఏ రకంగానైనా సరే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో భారత్ తో యుద్ధం చేసే అవకాశం లేదు కాబట్టి ఆర్ధికం గా అయినా సరే భరత్ ను ఇబ్బంది పెట్టలని చూస్తున్నాయి. అందులో బాగం గానే కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వెబ్ సైట్ ల మీద హాకింగ్ కు పాల్పడుతున్నారు పాక్, చైనా హాకర్లు.
ఇప్పడు అయోధ్య రామాలయం కు సంబందించిన వెబ్ సైట్ మీద హాకర్లు దాడులు చేసారని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా లో ఉన్న ప్రముఖ వెబ్ సైట్ ల మీద పాక్, చైనా హాకర్లు దాడులు చేసారు. హ్యాకింగ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న దాదాపు 1,244 IP అడ్రస్ లు బ్లాక్ అయ్యాయని వారు చెప్పారు. రామ మందిర వెబ్ సైట్ పై దాడి చేసిన 140 IP అడ్రెస్స్ లను గుర్తించామని వారు చెప్పారు.