“జనవరి 17 మరియు జనవరి 31 నాటి ఉత్తర్వుల ప్రకారం ముస్లింలు ఎటువంటి ఆటంకం లేకుండా నమాజ్ను చేసుకోవచ్చు అని అలాగే హిందూ పూజా కార్యక్రమాల కోసం తెహ్ఖానా ప్రాంతానికి పరిమితమైందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, యథాతథ స్థితిని కొనసాగించడం అనేది ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.
రెండు కమ్యూనిటీలు కు సంబందించిన సబ్యులు పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం పూజలు చేయడానికి వీలు కల్పిస్తుంది అని కోర్టు పేర్కొంది. మసీదు దక్షిణ సెల్లార్లో ఉన్న హిందూ దేవతలకు పూజకు అనుమతిని వ్యతిరేకిస్తూ జ్ఞాన్వాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్ను జూలైలో విచారణ చేపట్తుటాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం కొనసాగించాలని అలాగే వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ ప్రార్థనలను నిలిపివేయడానికి వేసిన పీటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే, మసీదు ఆవరణలో హిందువులు చేసే మతపరమైన ఆచారాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.