India has to apologize Maldivian opposition demand : ప్రధాని లక్ష్య ద్వీప్ పర్యటన : కొన్ని రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడి లక్ష్యద్వీప్ పర్యటించారు. లక్ష్యద్వీప్ కి స్వాగతం పలుకుతూ, భారతీయులని లక్ష్యద్వీప్ సందర్శించమని పిలుపునిచ్చాడు.
మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు :
మాల్దీవుల మంత్రులలో ఒకరు భారత్ ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు.
ఇజ్రాయెల్ తో మాల్దీవులకు ముందు నుంచే మంచి సంబంధాలు లేవు. ఇక మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల ఇజ్రాయెల్ పూర్తిగా లక్షద్వీప్ కే మద్దతుగా నిలిచింది.
ప్రత్యేక ఆకర్షణగా లక్షద్వీప్ :
ఈ వివాదం తరువాత లక్షద్వీప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్ కి పర్యటించాలంటూ చాలామంది ప్రముఖులు పిలుపునిచ్చారు.
ఇక ఈ కారణంగా లక్షద్వీప్ పర్యటనలో ఉన్న అవరోధాలను తొలగించే దిశగా ప్రభుత్వం అనేకరకల చర్యలు తీసుకుంది.
లక్షద్వీప్ ని మరింత ఆకర్షణీయంగా మార్చింది.
మాల్దీవులలో అంతర్యుద్దం :
మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల భారత్ మాల్దీవులను బాయ్ కాట్ చేసింది. మాల్దీవులకు విమానయానాన్ని రద్దు చేసింది. సోషల్ మీడియా లో బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ హాష్ ట్యాగ్ లతో మారుమోగిపోయింది.
దీనితో మాల్దీవులలో అంతర్యుద్దం మొదలైంది.
తమ అధికార పక్ష మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు క్షమాపణ చెప్పాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
చైనాకు మద్దతుగా ఉన్న తమ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు.