PM Modi Lakshadeweep Visit: లక్ష దీవులలో భారత ప్రధాని ప్రయాణం.

Indian Prime Minister's Journey to Lakh Islands

PM Modi Lakshadeweep Visit: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అందమైన దీవులు మనకు దర్శనమిస్తాయి. అవి ఎంతో అందంగా ఉండడంతో పాటు వాటిని చూడడానికి వెళ్లిన టూరిస్టులకు ఎంతో ఆనందాన్ని పంచుతాయి.

అందుకే ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ భారతదేశంలో ఉన్న దీవులను ప్రమోట్ చేయడంలో బిజీ(busy) అయిపోయారు.

అనగానే భారతీయులందరికి గుర్తుకొచ్చేవి మాల్దీవులు. వీటిని చూడడానికి భారతదేశం నుండి చాలా ప్రాంతాల వారు తరలి వెళుతుంటారు. కానీ, ఈసారి మోదీ జీ చూపులు లక్ష దీవుల(Lakshadweep) వైపు చూసాయి.

ఈ సందర్భంగాకేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలలో అక్కడ ప్రజల మంచి హృదయాలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆ తరువాత అక్కడ ఉన్న అందమైన బీచ్ లను సందర్శించి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంతో ఫోటోలనుదిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

లక్షద్వీప్(Lakshadweep)ప్రజల మధ్య ఉండే అవకాశం నాకు వచ్చిందని, ఈ ద్వీపాలు ఎంతో అద్భుతాలకి నిలయాలని పీఎం modi పేర్కొన్నారు.

లక్ష దీవుల ప్రజలు ప్రేమ తో అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అందమైన ప్రకృతిని చూడడానికి తెల్లవారుజామునే బీచ్ ల వెంట పాయనాన్ని కొనసాగించానని,

ఈ నా ప్రయాణం నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందని పీఎం మోదీ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు మోదీజీ స్నోర్ కెల్లింగ్తో పాటు సముద్రం ఒడ్డున ఒక బుక్ ను చదువుతూ గడిపేశారు.

Leave a Comment