తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు సంబందించి ఒక సంచలనం లేక విడుదల చేశారు. లేఖలు విడుదల చేయడం ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు ఎన్నో లేఖలు విడుదల చేశారు. అంతేకాకుండా తనకు కవితకు జరిగిన చాటింగ్ సంబందించి అన్ని డీటెయిల్స్ కూడా మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈరోజు కవిత తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధిస్తున్నారు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలు అని అర్థం చేసుకోవచ్చు అంటూ ఆ లేఖ లో రాసాడు. ఇన్ని రోజులకు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చాయని తన ఖర్మానుసారం ఇలా జరుగుతోంది సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖలో రాసుకొచ్చాడు.
అంతేకాకుండా ఇప్పటి వరకు సంపాదించిన వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం సింగపూర్, హాంకాంగ్, జర్మని వంటి దేశాలకు పంపిన విషయాలు కూడా అన్ని బయటికి వస్తాయని అతను లేఖలో పేర్కొన్నాడు. కవిత ని అక్క అంటూనే వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాలకు సంబందించిన కదలు, రేంజ్ రోవర్ కలెక్షన్స్ అలాగే గోవా లో జరిగిన కథలు, కాంట్రాక్టులు సంబంధించినవి ఎంక్వైరీ లో నిజం అని తెలిసింది కదా అక్కా! ఇక బయటపడే మార్గం లేదు, కనిపించడం కుడా లేదు, ఇప్పటికైనా ఒక రిక్వెస్ట్, అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీ వాల్ నీ కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు అక్క అని లేఖలో కోరాడు.
దేశ ప్రజలకు అంతా తెలుసుకున్నారు, సాక్ష్యాలు కూడా దొరికాయి, న్యాయస్థానం కూడా నిజం తెలుసుకుంది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్న అంటూ కేజ్రీవాల్కి ఒక విషయం చెప్పాడు సినిమా ఇంకా మిగిలి ఉంది తర్వాత తదుపరి కోర్టు మెట్లు ఎక్కబోయేది మీరే అంటూ లేఖ లో రాశాడు.