![ISRO's miracle on New Year's Day.](https://6tvnews.com/wp-content/uploads/2024/01/Add-a-heading-2024-01-01T160456.156-1024x576.jpg)
SRO XPoSat Mission: చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుని పైకి చేరుకున్న భారత్ 2023 లో అత్యంత పెద్ద ఘనత సాధించింది అని చెప్పాలి.
ఈ మిషన్ విజయవంతం అయిన సమయంలో భారత ప్రధాన మంత్రి నుండి సామాన్య పౌరుడివరకు ప్రతి ఒక్కరు ఎంతగానో సంతోషించారు. అదే ఉత్సాహంలో మన భారత శాస్త్ర వేత్తలు సూర్యుడిపై కూడా పరిశోధనలు జరపాలని భావించారు.
అందులో భాగంగానే ఆదిత్య ఎల్ 1 అనే మిషన్ ను ప్రయోగించారు. మరి 2024 కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు నూతన సంవత్సరం రోజున హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ కూడా ఒక మిషన్ ను ప్రయోగించింది.
ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగం : Expo Polarimeter Satellite
నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఏడాదికి గాను మొదటి అంతరిక్ష యాత్రను చేపట్టింది.
జనవరి ఒకటవ తేదీన ప్రయోగించిన ఈ మిషన్ పేరు ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. ఈ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,
ఎక్స్ పోసాట్ తో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పై అధ్యయనాలు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల భారత్ మరో ఘనత సాధించినట్టయింది.
అంతరిక్షంలోకి, ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీని పంపించిన దేశాల్లో రెండవదిగా భారత్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.
మొదట అమెరికా తరువాత భారత్ : First Place Goes To America And Second India
దీనిని హాంతరిక్షంలోకి పంపించడం వల్ల బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటి గురించి మరింత సమాచారం సేకరించడానికి వీలవుతుంది.
మనకన్నా ముందు ఈ ప్రయోగం చేసిన దేశంగా అమెరికా ఒకటవ స్థానంలో ఉంది, అగ్రరాజ్యం అమెరికా 2021 లోనే ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అనే ఒక మిషన్ ను ప్రయోగించింది.
ఆ మిషన్ ద్వారానే బ్లాక్ హొల్స్, న్యూట్రాన్ నక్షత్రాల గురించి సమాచారాన్ని అందుకోగలుగుతున్నారు అమెరికా శాస్త్రవెత్తలు.