సినీ పరిశ్రమలో పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్ గడిపిన తారలు ఒక్కొక్కరిగా పెళ్లికి రెడీ అవుతున్నారు. లేడీ విలన్గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sharath Kumar ) కూడా త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sharath Kumar) తన నివాసంలో కూతురు వరలక్ష్మి ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ముందుగా సమాచారం లేకుండా ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా చేయడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు?l పెళ్లి ఎప్పుడు? అని ఆమె అభిమానులు కూపీలాగడం మొదలుపెట్టారు.
దక్షిణదిలోని అన్ని భాషల్లో వరలక్ష్మి( Varalaxmi Sarathkumar)సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ 50కి పైగా సినిమాల్లో నెగటివ్ రోల్ లో నటించింది. తెలుగులో క్రాక్ (Crack ), వీరసింహారెడ్డి(Veerasimhareddy ), నాంది (Naandi ) వంటి సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్ అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్ లోనూ వరలక్ష్మికి మంచి గుర్తింపు ఉంది. హీరోయిన్ గానే కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ హీరోయిన్గా కంటే విలన్గానే బాగా ఫేమస్ అయ్యింది. ఈ మధ్యనే హనుమాన్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి అందరిని అలరించింది. ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది వరలక్ష్మి. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ పెళ్లి గురించి అడిగితే ఆన్సర్ ఉండేది కాదు. ఇక లేటెస్ట్ గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.
వరుడు పెయింట్ ఆర్టిస్ట్:
ముంబై(Mumbai )కి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్దేవ్(Nicholaisachdev)తో వరలక్ష్మికి ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ నిశ్చితార్థం వేడుకలకు రెండు కుటుంబాలు మాత్రమే పాల్గొన్నాయి. రాధిక (Radhika )కూతురు కూడా ఈ ఫోటోల్లో కనిపిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో దిగిని ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాదే వీరి వివాహం జరుగుతుందని సమాచారం. త్వరలోనే మ్యారేజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.