Once again in the Lok Sabha elections Tamil Sai – contest from Chennai : మాజీ తెలంగాణా గవర్నర్ తమిళ సై కిషన్ రెడ్డి సమక్షం లో BJP చేరారు. ఇప్పుడు ఆమె చెన్నై నుండి ఎలక్షన్స్ లో పోటీ చెయ్యడానికి ఆమె సొంత రాష్ట్రం అయిన తమిళ నాడుకు ఇటీవలే వెళ్ళారు. ఆమె ఎలాగైనా ఎలక్షన్స్ లో పోటీ చెయ్యాలనే భావన లో ఉన్నారని BJP నాయకులూ చెప్తున్నారు.
ఆమె తూత్తుకుడి నుండి కాని విరుదునగర్ నుండి కాని ఆమె పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. గత ఎలక్షన్స్ లో తూత్తుకుడి నుండి పోటీ చేసి DMK అభ్యర్ధి అయిన కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2006 నుండి ఆమె ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న ఇంత వరకు విజయాన్ని అందుకోలేక పోయారు.
తమిళ నాడు PCC ,మాజీ అద్యక్ష్దుడు కమరి ఆనంద్ కుమార్తె ఈ తమిళ సై సౌందర రాజన్. 1999 సంవత్సరం లో BJP విధానాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీ లో చేరారు. తమిళనాడు లో BJP పార్టీ ని లో ఆమెది చాలా కీలక పాత్ర అని నాయకులు చెప్పారు.
అంతే కాకుండా BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాను ఆ తర్వాత BJP అధ్యక్షరాలు కుడా చేసింది. అనంతరం జాతీయ కార్యదర్శి కూడా చేసారు. చివరగా 2009 సంవత్సరం లో లోక్ సభకు ఉత్తర చెన్నై నుండి పోటీ చేసి ఒడి పోయారు.
ఆ తర్వాత 2019 లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో AIDMK కూటమి నుండి మరల తూత్తుకుడి నుండే పోటీ చేసిన ఓటమి చూడాల్సివచ్చింది. తదనంతరం ఆమె తెలంగాణ గవర్నర్ గా పదవి భాద్యతలు స్వీకరించి ఇటీవల వరకు కొనాసాగారు.