PM Modi Advice Police: లాఠీ తొ కాదు డేటా తో పనిచేయండి..మోదీ వ్యాఖ్యలు వైరల్.

Work with data not stick..

PM Modi Advice Police: లాఠీ తొక్కాడు డేటా తో పనిచేయండి -ప్రధాని మోదీ వ్యాఖ్యలు వైరల్ PM Modi Advice Police To Work With Data Rather Than Lathiరాజస్థాన్(Rajasthan) రాష్ట్ర రాజధాని జైపూర్‌(Jaipur) లో డీజీపీ (DGP)-ఐజీ(IG) అధికారుల సదస్సు ను నిర్వహించారు.

ఈ సదస్సుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్(Amith Sha) షా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇక ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతపై చర్చించడం అలాగే కొత్త క్రిమినల్ చట్టం9New Criminal law) అమలు చేసేందుకు అవలంభించాల్సిన అంశాలపై చేర్చించడం.

ఇక ఈ సమావేశాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajith Dhowal) అధ్యక్షతన నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి భారత దేశం లో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన డీజీపీ లు

ఐజీ లు హాజరయ్యారని, వీరు మాత్రమే కాక, మనదేశంలో ఉన్న 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని డీజీపీ లు, ఐజీ లు కూడా సదస్సుకు వచ్చారని సమాచారం. మొత్తం మీద సుమారు 250 మంది పోలీసు అధికారులు పాల్గొన్నట్టు గా సమాచారం అందుతోంది.

పీఎం మోదీ వ్యాఖ్యలు వైరల్ : PM Modi’s comments went viral

ఇక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మాట్లాడుతూ ముందుగా పోలీసు అధికారులకు ఒక ముఖ్య సూచన చేశారు.

పోలీసులు లాఠీ తో కాకుండా డేటా తో పనిచేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు చాల ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అంతే కాకుండా ప్రధాని మోదీ మరో విషయాన్నీ కూడా నొక్కి వక్కాణించారు. రాబోయే రోజుల్లో మహిళలు9Women), బాలికలకు 9Girl) సంబంధించి వారి హక్కులు, అలాగే రక్షణపై పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించదానికి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు.

కొత్త నేర చట్టాలను దేశ పౌరుల గౌరవానికి, న్యాయానికి మొదటి ప్రాధాన్యాన్ని ఇచ్చి రూపొందించినట్టు వెల్లడించారు. అయితే ప్రధాని మోదీ చేసిన ఒక వ్యాఖ్య గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

పోలీసులు లాఠీ(Police Lathi) కన్నా డేటా ను వదలని సూచించిన విషయం వైరల్ గా మారింది. ఈమధ్య చాలా సందర్భాల్లో పోలీసులు

అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన వీడియోలు ఇంటర్ నెట్ లో తెగ హల్చల్ చేశాయి. దీంతో మోదీ వ్యాఖ్యలు వాటికి బలం చేకూర్చినట్టయింది. పైగా ఇకమీదట దేశ పౌరులపై ఆ దాష్టీకం తగదని ఆ కొంతమంది పోలీసులకు మోదీ సున్నితమైన హెచ్చరిక జారీచేసినట్టయింది.

Leave a Comment