PM Modi Fasting For 11 Days: జనవరి 22 ఈ తారీఖు కోసం భారత దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఎందుకంటే రామ జన్మభూమి అయోధ్య (Ayodhya)లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. పైగా అదే రోజున రాం లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేతుల మీదుగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఈక్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో నిరీక్షించిన వారు అనేక మంది.
అటువంటి ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి తరించాలని భావించి, అయోధ్యకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
అయితే ఒక విశేషం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర గర్భగుడిలో, రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్న నేపదంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ట చేపట్టే ముందు పదకొండు రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ప్రధానికి మద్దతుగా : PM Modi Got Support From People
ఈ ఉపవాసాన్ని అత్యంత నిష్ఠతో చేపట్టాలని మోదీ భావించారు. అందుకోసం దేశ ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలని అయన కోరారు. ఈ విషయాన్నీ ఆయన తన వెబ్ సైట్(narendramodi.in) లో అలాగే యూట్యూబ్(Youtube) ఛానెల్ ద్వారా కూడా తెలియజేశారు.
మోదీ ఈ విషయాన్నీ అలా చెప్పారో లేదో, అనేకమంది ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. ఆయనకు మద్దతుగా ఉంటామని చెబుతూనే విషెస్ చెబుతూ లక్షల మంది కామెంట్లు పెట్టారు, మరి కొందరైతే ఒక అడుగు ముందుకేసి భారత దేశానికి మీ వంటి వారు నేతగా దొరకడం అదృష్టమని చెబుతున్నారు.