Police Case On Daggupati Heros : దగ్గుపాటి హీరోలపై కేసు ? – వీరు ఏంచేశారంటే ?

website 6tvnews template 2024 01 29T122633.585 Police Case On Daggupati Heros : దగ్గుపాటి హీరోలపై కేసు ? - వీరు ఏంచేశారంటే ?

Police Case On Daggupati Heros : దగ్గుపాటి హీరోలకు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. హీరో వెంకటేష్(Hero Venkatesh) ఆయన సోదరుడు ప్రొడ్యూసర్ సురేష్ బాబు(Suresh Babu), అయన కుమారులు హీరోలైన రానా దగ్గుపాటి(Rana Daggupati), అభినవ్ దగ్గుపాటి(Abnhinav Daggupati) పై కేసు నమోదు చేయాలనీ నాంపల్లి కోర్టు(Nampalli Court) ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఇంతకీ ఏ విషయంలో వీరిపై కేసు చేశారు అంటే డెక్కన్ కిచెన్ అనే హోటల్ ను వీరు కూల్చివేయించారు అనే అభియోగం పై వీరిమీద కేసు నమోదు చేయమన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో నాంపల్లి కోర్టు విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేయాలనీ ఆదేశించినట్టు సమాచారం.

ఇక ఈ కేసు విషయంలోకి వెళితే తనకు హోటల్ విషయం లో లీజు ఉన్నప్పటికీ దగ్గుపాటి ఫ్యామిలీ దౌర్జన్యానికి పాల్పడిందని నందకుమార్ ఆరోపించాడు.

venkatesh Police Case On Daggupati Heros : దగ్గుపాటి హీరోలపై కేసు ? - వీరు ఏంచేశారంటే ?

హోటల్ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేసి కూల్చేవేశారని, అంతేకాక హోటల్ లోని ఫర్నిచర్ మొత్తాన్ని తీసుకెళ్లారని అన్నారు. (Police Case On Daggupati Hero’s) సుమారు 60 మంది బౌసర్లతో వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డారని చెప్పారు.

ఈ ఘటనలో కొందరు జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు అధికారులు కూడా దగ్గుపాటి ఫ్యామిలీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

వెంకటేష్, సురేష్, రానా, అభినవ్ లు హోటల్ ను ధ్వంశం చేయడం వల్ల తనకు 20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వాపోయారు నందకుమార్. ఈ విషయాలన్నిటిని పొందుపరుస్తూ కోర్టు లో పిటిషన్ వేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా, అభినవ్ లతోపాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబు పై కూడా కేసు నమోదు చేయాలనీ ఆదేసింది.

Leave a Comment