Anasuya Bharadwaj: సాగర తీరంలో రంగమ్మత్త.. ఫోటోలు వైరల్.

Rangammatta on the shore of the ocean.. Photos are viral.

Anasuya Bharadwaj: సాగర తీరంలో రంగమ్మత్త.. ఫోటోలు వైరల్

బుల్లితెరకు బై బై చెప్పి వెండితెరపై ఫోకస్ పెంచింది మన రంగమ్మత్త. బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని కాబోలు హాట్ హాట్ ఫోటో షూట్లతో యాంకర్ అనసూయ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది.

ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీలో నటిస్తోంది. షూటింగ్ లేనప్పుడు ఖాళీ సమయంలో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ , ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడమే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోలతో సందడి చేస్తోంది.

లేటెస్టుగా అనసూయ పట్టు చీరకట్టుకుని బీచ్ ఒడ్డున వయ్యారంగా కూర్చుని అదిరిపోయే ఫోటోలు దిగింది ఆ ఫోటోలను తన ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి అనసూయ హాట్ టాపిక్ గా మారింది.

నెటిజన్స్ ఎన్నిరకాలుగా ట్రోల్ చేసినా సోషల్ మీడియాలో మాత్రం అనసూయ అందాల హంగామా ఆగడం లేదు. కుర్రాళ్ల కామెంట్స్‏ని లైట్ తీసుకుంటూ సోషల్ మీడియాలో అందాల జాతరతో రచ్చ రచ్చ చేస్తోంది.

ఈ క్రమంలోనే లేటెస్టుగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అందమైన చీరకట్టులో పొడవాటి వాలు జడ వేసుకొని సముద్రం తీరంలో హాట్ పోజులు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది అనసూయ భరద్వాజ్.

కైపెక్కించే చూపులతో కెమెరా ముందు రచ్చ చేసేసింది. శారీ లుక్‎లో అనసూయ అందం రెట్టింపైంది. ఈ బ్యూటీ చీరకట్టు అందాలను అలా చూస్తూ ఫిదా అవుతున్నారు.

అందంతో ఆకర్షించడంలో హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది అనసూయ. ఎప్పటికప్పుడు నెట్టింట్లో లేటెస్ట్ లుక్స్ షేర్ చేస్తూ జనాల్లో హాట్ టాపిక్‎గా నిలుస్తుంది.

టెలివిజన్‎కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరు ముందు లైన్లో ఉంటుంది. మాటలతో మ్యాజిక్ చేయడమే కాదు అందాల ఆరబోతతో అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. అలా మాయ చేయడం అనసూయ నైజం అని చెప్పక తప్పదు.

పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని పరేషాన్ చేయాలన్నా, చీరకట్టుతో నాభి అందాలు చూపిస్తూ మత్తెకించాలన్నా అనసూయకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అందచందాలతో పాటు స్పాటేనియస్ మాటలతో తెలుగువారి హృదయాలను దోచుకుంది.

న్యూస్ ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్డ్ చేసిన అనసూయ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రావాలని డిజైడ్ అయ్యింది. అలా జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది ఈ భామ.

అయితే మిగతా యాకర్లలా మాటలతోనూ కాదు తన అందాల ప్రదర్శనతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఒక్క షో అమ్మడిని ఎక్కడికో తీసుకెళ్లింది.

జబర్దస్త్ యాంకర్ గా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. బుల్లితెరమీద పాపులర్ కావడంతో వెండితెర వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

సినిమాల్లోనూ స్పెషల్ క్యారెక్టర్లను పోషిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లను పోషించి కొద్ది కాలంలోనే క్రేజీ ఆఫర్లను కొట్టేసింది అనసూయ.

దీంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండితెరమీద వెలుగు వెలిగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది అనసూయ.

అంతే కాదు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను ఎప్పటికప్పుడు

పంచుకుంటూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న అనసూయ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.

అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2లో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

ఇవే కాదు చాలానే ప్రాజెక్ట్స్ ఈ భామ చేతిలో ఉన్నాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె కాల్ షీట్ల కోసం క్యూ కడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన పెదకాపు1 సినిమాలో కీలక పాత్రలో కనిపించింది అనసూయ. అలాగే ఆమె ప్రేమ విమానం అనే మరో మూవీలో నటించింది.

ఈ మూవీలో అనసూయ నటన అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాలే కాదు అనసూయ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌ లో కూడా నటిస్తోందని సమాచారం.

Leave a Comment