రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టేషన్లలోనే

website 6tvnews template 2024 03 05T173640.242 రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టేషన్లలోనే

Swiggy food for train passengers in these stations in Telugu states : ఇక తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు వారికి కావలసిన ఆహారం స్విగ్గి లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి మాత్రమే అందుబాటు లో ఉంటుంది. ఈ మేరకు స్విగ్గి రైల్వే కు సంబందించిన IRCTC కి మడి ఒక ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం ఈ నెల అంటే మర్చి 12 నుండి ప్రయాణికులకు ఈ సేవలు లభిస్తాయని స్విగ్గి తెలిపింది. మొదట గా విశాఖ, విజయవాడ తో పాటు భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్ లలో ఈ సేవలు మొదలు అవుతాయి.

అయితే మేరు ఆర్డర్ చెయ్యాలంటే మాత్రం తప్పకుండా IRCTC యాప్ ని వాడాల్సి ఉంటుంది. అందులో మీ PNR ఎంటర్ చేసి మీకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఏ స్టేషన్ లో డెలివరీ కావాలో అక్కడే ఈ ఆర్డర్ ను పొందవచ్చు.

దీని వల్ల ప్రయాణికులకు మరింత చేరువ అవుతామని స్విగ్గి ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రయాణికుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని స్విగ్గి CEO రోహిత్ కపూర్ అన్నారు.

Leave a Comment