IPL 2020: భారీ ధరకు అమ్ముడు పోయిన ఆటగాడు..2020 ఐపీఎల్ లోనూ కమ్మిన్స్ హవా.
Sunrisers Hyderabad are aggressive in IPL auction:
సన్రైజర్స్ హైదరాబాద్ ఓకే సరి కొత్త చరిత్ర సృష్టించింది, ఐపీఎల్ వేలంలో ఈదూకుడు ప్రదర్శిస్తోంది. ఒక ఆటగాడిని ఏకంగా 20.50 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసింది.
ఆటగాడు మరెవరో కాదు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, దీంతో ఇతగాడి పంట పండింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాట్ కమిన్స్ నిలిచాడు.
Again pat Cummins got highest rate:
వన్ డే పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో పాట్ కమిన్స్ తన సత్తా చాటాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత్ను ఓటమి బాట పట్టించడం ద్వారా అతడికి ఐపీఎల్ లో ఈ ఘనత దక్కింది.
కమిన్స్, లీగ్ చరిత్రలోనే రెండు గంటలపాటు అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్ను అధిగమించాడు, సహచర ఆసీస్ మిచెల్ స్టార్క్ చుస్తే, ఏకంగా 24.75 కోట్ల రూపాయలకు విలువ పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని వేలంలో దక్కించుకుంది.
30 ఏళ్ల వయసున్న కమిన్స్ ‘హెక్టిక్ షెడ్యూల్’ కారణంగా మునుపటి ఎడిషన్ను దక్కించుకోలేకపోయాడు, అయితే ఐపీఎల్ వేలంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ఆటగాడిలా,
లేదంటే ఎక్కువ జట్లు అతగాడిని కోరుకున్న ఆటగాడిలా కూడా అతని పేరు నిలిచింది. ఇక ఈ వేలంలో అతని ప్రారంభ ధర చూస్తే 2 కోట్ల రూపాయలు గా ఉంది.
Cummins rate is high in 2020 IPL
కమ్మిన్స్ గతంలో 2020 సంవత్సరంలో నిర్వహించిన IPL వేలంలో కూడా తక్కువ ధరకు ఏమి అమ్ముడు పోలేదు. అతడిని కోల్కతా నైట్ రైడర్స్ అప్పట్లో 15.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
అప్పటికి అది ఎక్కువ ధరే, ఎక్కువ ధర కాదు అత్యంత ఖరీదుకి కొనుగోలు చేయబడిన ఆటగాడిగా అప్పడు కమిన్స్ రికార్డ్ సృష్టించాడు.
Players who did not sold in first set:
చెన్నై సూపర్ కింగ్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ బిడ్డింగ్ లో బాగానే పోటీ పడ్డాయని చెప్పొచ్చు. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరు తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ సహచర ఆసీస్, ప్రపంచ కప్ హీరో ట్రావిస్ హెడ్ను 6.80 కోట్ల కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
ఇది ఇలా ఉంటె, ఆస్ట్రేలియా జట్టు మాజీ సారధి స్టీవ్ స్మిత్ ను, దక్షిణాఫ్రికా జట్టులోని రిలీ రోసౌ, భారత్ జట్టులోని చెందిన కరుణ్ నాయర్, మనీష్ పాండేల పరిస్థితి మరోలా ఉంది. పాపం ఈ ఆటగాళ్లు తొలి సెట్లో అమ్ముడుపోలేదు.