Uppal match Super Hit But India Loose The Match : ఇండియా– ఇంగ్లండ్ మ్యాచ్(India – England Match) నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) కళలాడింది. హౌస్ ఫుల్ అయిన ఉప్పల్ స్టేడియం ను చుస్తే ఇండియా– ఇంగ్లండ్ మ్యాచ్ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. మ్యాచ్ మొదలైన తొలి రోజు నుండి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు క్రికెట్ అభిమానులు.
భారత్ ఇంగ్లాండ్ ఆటను వారు ప్రత్యక్షంగా చూస్తూ ఎంజాయ్ చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్ కి ఒక లక్షా 10 వేల మంది హాజరయ్యారు.
క్రికెట్ ను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేది ఒక ఎత్తు ప్రత్యక్షంగా చూసేది మరో ఎత్తు. అందుకే ఎక్కువ మంది స్టేడియంకె వచ్చి ఆ కిక్ ను ఎంజాయ్ చేస్తారు.
ఇక జనవరి 28వ తేదీన చూస్తే ఆదివారం సేవవుదినం కావడంతో ఎక్కువ మంది హాజరయ్యారు అని చెప్పాలి. మ్యాచ్ చూసేందుకు ఏకంగా 29,368 మంది ప్రేక్షకులు స్టేడియంకి విచ్చేశారు.
స్టేడియంలో జై శ్రీరామ్ నినాదాలు : Jai Shree ram slogans In Stadium
ఇక మ్యాచ్ ఆఖరు రోజు కూడా కావడంతో ఉత్కంఠగానే సాగింది. ఆడియన్స్ ఆటను బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి.
ఎందుకంటే భారత జట్టు జట్టు ఓటమి కి చేరువైన సమయంలో భారత జట్టు అభిమానులు, కమాన్ ఇండియా, జై శ్రీరాం అనే నినాదాలతో ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే నినాదాలతో స్టేడియం హోరెత్తింది.
కానీ అనూహ్యపరిణామాల నడుమ ఇండియా చివరకు ఓటమిని చవిచూడకతప్పలేదు.(India Loose The match) దీంతో భారత జట్టు అభిమానులు డల్ అయిపోయారు కానీ, ఇంగ్లండ్ టీమ్ ఫాన్స్ మాత్రం చాలా సంతోషపడ్డారు.
తమ అభిమాన జట్టు భారత గడ్డపై గెలుపు జండా ఎగురవేయడంతో సంబరాలు చేసుకున్నారు.