2022-05-21News Desk ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక మూడోసారి కూడా తాను అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సమావేశమైన భరూచ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చాలా సీనియర్ అయిన ప్రతిపక్ష నాయకుడు ఒకసారి తనను రెండుసార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా ఏమి సాధించాలని అడిగారని పేర్కొన్నారు. View more
2022-05-20News Desk బంగారం.. ఇది భారతీయ సంప్రదాయంలో భాగం అయింది. ప్రతి శుభకార్యంలోనూ దీనికి చోటు ఉంటుంది. మొదట్లో ఇది అవసరమే అయినా ఈ కాలంలో ఇదో పెట్టుబడి సాధనంగా కూడా మారింది.సందర్భాలు వెతికి మరీ ఇండియన్స్ పుత్తడి కొనడం సహజం. ప్రపంచంలో వాడుతున్న బంగారంలో 11శాతం నగలు రూపంలో మన ఇండియన్స్ దగ్గరే ఉంది. View more
2022-05-20News Desk ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి వారివారి సొంత అభిరుచులు ఉంటాయి. కొంతమందికి పానీపూరి తినడం అంటే ఇష్టం.. మరికొందరికి వర్షంలో మిర్చి బజ్జీ తినడం.. ఇంకొందరికి పాడటం.. లేదా డ్యాన్స్లు చేయడం.. ఇలా వారందరూ కూడా వారికి ఇష్టమైన పనులను సమయం దొరికినప్పుడల్లా ట్రై చేస్తుంటారు. View more
2022-05-20News Desk రాజద్రోహం కేసులకు భయపడే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జగదీష్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. పటేల్ పై పలు రాజద్రోహం కేసులున్నాయని, అందువల్ల జైలుకు పోవలసివస్తుందని భయపడి పార్టీ నుంచి నిష్క్రమించాడని ఆయన అన్నారు. View more
2022-05-20News Desk గత కొద్ది రోజులుగా బిహార్ రాజకీయమంతా పన్నెండేళ్ళ బాలుడి చుట్టూనే తిరుగుతోంది. రాజకీయనాయకులంతా సోను కుమార్ ఇంటికి క్యూ కడుతునున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎందుకు అంతగా వారినందర్నీ ఆకర్షిస్తున్నాడో తెలుసుకుంటే ఆశ్చర్యమవుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉండి సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని సోనూ కుమార్ నిరూపించాడు. View more
2022-05-20News Desk ఆమేమీ తల్లి మరణాన్ని అర్థం చేసుకోలేని పసిపిల్ల కాదు.. 26 ఏళ్ల మహిళ.. అయినా కూడా తల్లి శవంతోనే పది రోజుల పాటు జీవించింది. ఈ పది రోజులు ఎలా ఉందో.. ఏం తిన్నదో తెలియదు కానీ ఆమె కనీసం బయటకు వచ్చింది లేదు. ఎవరినీ సాయం కోసం అర్థించిందీ లేదు. పోలీసులు వెళ్లేసరికి మాట్లాడే స్థితిలో కూడా లేదు. అయితే మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. View more
2022-05-20News Desk గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ 'చింతన్ శిబిర్' సమావేశాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. View more
2022-05-20News Desk కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటని, కుటుంబ పార్టీలు ఎప్పుడూ తమ కుటుంబాలపైనే ఆధారపడతాయని ప్రధాని మోడీ అన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలనుద్దేశించి వర్చ్యువల్ గా ప్రసంగిస్తూ ఆయన.. కొన్ని పార్టీలు దేశం ఎదుర్కొంటున్న క్లిష్టతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న యత్నాలను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. View more
2022-05-20News Desk భారతదేశంలో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలు సైతం ఒక్కొక్కటిగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలోనే పశువుల సంఖ్య కూడా దేశంలో రోజురోజుకీ తగ్గిపోతుంది. తద్వారా పశువుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. పశువులు, పౌల్ట్రీకి సంబంధించిన తాజా జాతుల వారీ నివేదిక ప్రకారం, ఇరవై మూడు జాతుల దేశీయ పశువుల సంఖ్య 2012 - 2019 మధ్య ఏడేళ్లలో 1.08% నుంచి 93.48% వరకూ తగ్గింది. View more
2022-05-20News Desk దేశంలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలకు జనాలు మాడిపోతుంటే.. మరోవైపు వానలకు తడిసిపోతున్నారు. ఉత్తరాదిలో భానుడు భగభగ మండుతుంటే.. దక్షిణాదిలో వరుణుడు దంచికొడుతున్నాడు. View more
2022-05-20News Desk మందిరం- మసీదు వివాదాలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లకు కూడా పాకుతుండటం ఆందోళన కలిగించేదే. ఇక తెలంగాణలో చాలా ఆలయాలకు పక్కనే మసీదులు మనకి కనిపిస్తాయి. ఇప్పటి వరకు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ సాగిపోతున్న జనజీవనంలో సరికొత్త వివాదాలు పెద్ద చిచ్చే రేపేలా కనిపిస్తోంది. View more
2022-05-20News Desk వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అసలు మసీదే కాదని హిందూ సంఘాలు .. సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. వారణాసిలోని ఆది విశ్వేశ్వరుని ఆలయాన్ని పడగొట్టాలని నాడు ఔరంగజీబు ఆదేశించాడని, అంతే తప్ప ఆ స్థలం వద్ద వక్ఫ్ ని ఏర్పాటు చేయాలని గానీ.. లేదా ఈ స్థలాన్ని ఏ ముస్లిం వ్యక్తికైనా లేక ముస్లిముల సంఘాలకైనా అప్పగించాలని కోరలేదని హిందూ సంఘాలు పేర్కొన్నాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy